నక్సల్స్కుచర్చలపై ఆసక్తి ఉన్నట్లు లేదు:జానారెడ్డి
హైదరాబాద్:చర్చలు కొనసాగాలనే భావనమావోయిస్టులకు ఉన్నట్లు అనిపించడంలేదని హోం మంత్రి కె. జానారెడ్డివ్యాఖ్యానించారు. నక్సలైట్లతో చర్చలుజరపాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమనిఆయన గురువారం విలేకరులతోచెప్పారు. చర్చలకు అనుకూలమైనవాతావరణం ఏర్పడడానికిసంయమనం పాటించాలనిమావోయిస్టులను తాను పదే పదేకోరుతూ వస్తున్నానని, అయితే వారువినడం లేదని ఆయన అన్నారు.
పెద్దమనుషులతో,మధ్యవర్తులతో మాట్లాడినక్సలైట్లతో చర్చలు జరిపే విషయంపైనిర్ణయం తీసుకుంటామని ఆయనచెప్పారు. అయితే ఇప్పటి వరకు తానువారితో మాట్లాడలేదని, ప్రతి రోజూజరుగుతున్న సంఘటనల వల్లనేతాను ఇప్పటి వరకు వారితోమాట్లాడలేకపోయానని ఆయన అన్నారు.చర్చలు జరగాలని కోరుకునేవారునక్సల్స్ సంయమనం పాటించేలాచూడాలని, అయతే ఆ పని జరగడం లేదనిఆయన అన్నారు. నక్సలైట్లపై తిరిగినిషేధం విధించాలా, వద్దా అనే విషయంపైప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామనిఆయన చెప్పారు.