అసెంబ్లీ:నెట్టెంపాడు ప్రాజెక్టుపై టిడిపి వాకౌట్‌

హైదరాబాద్‌:నెట్టెంపాడు టెండర్ల ఖరారులో అవినీతినినిరసిస్తూ తెలుగుదేశం పార్టీశుక్రవారం శాసనసభ నుంచి వాకౌట్‌చేసింది. కృష్ణానదిపైమహబూబ్‌నగర్‌ జిల్లాలో తలపెట్టిననెట్టెంపాడు సాగు నీటి ప్రాజెక్టుటెండర్ల ఖరారులో పెద్ద యెత్తునఅవినీతి చోటు చేసుకుందని తెలుగుదేశంపార్టీ ఆరోపించింది. నెట్టెంపాడు ప్రాజెక్టుపైప్రతిపక్ష తెలుగుదేశం, అధికారకాంగ్రెస్‌ సభ్యుల మధ్య తీవ్రవాగ్వాదం చెలరేగింది. టిడిపి ఆరోపణలనుభారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాలలక్ష్మయ్య ఖండించారు.

జలయజ్ఞంపేర కాంగ్రెస్‌ ప్రభుత్వం ధనకైంకర్య యజ్ఞానికి పాల్పడుతోందనిప్రతిపక్ష నాయకుడు నారాచంద్రబాబునాయుడు వాకౌట్‌ చేసినఅనంతరం విలేకరులతో అన్నారు.సాగునీటి ప్రాజెక్టులలో ముఖ్యమంత్రికార్యాలయం అధికారులు, శాసనసభ్యులు,పార్లమెంటు సభ్యులు పెద్ద యెత్తునసొమ్ము చేసుకుంటున్నారని ఆయనఅన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు విషయంలోశివకుమార్‌ ఇచ్చిన నివేదికనువెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు.ఈ నివేదికను వెల్లడిస్తే మొత్తంసాగునీటి ప్రాజెక్టుల టెండర్లవ్యవహారంలో జరుగుతున్న అవినీతి ఏమిటోఅర్థమవుతుందని ఆయన అన్నారు.

తెలుగుదేశంఆరోపణలను కాంగ్రెస్‌మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిశాసనసభ్యుడు జి. చిన్నారెడ్డి విలేకరులసమావేశంలో ఖండించారు. ఇంకాటెండర్లే ఖరారు కాలేదని, పనులుకూడా ప్రారంభం కాలేదని, ఇటువంటిసమయంలో టిడిపి ఆరోపణలు చేయడంఅర్థరహితమని ఆయన అన్నారు.వెనకబడిన మహబూబ్‌నగర్‌జిల్లాను తెలుగుదేశం ప్రభుత్వహయాంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నచంద్రబాబు నాయుడు దత్తతకుతీసుకుని ఏమీ చేయలేదని, ఇప్పుడునెట్టెంపాడు ప్రాజెక్టు పనులుప్రారంభమయ్యే దశలోఅడ్డుకుంటున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+