తెలంగాణపైకేంద్ర నాయకత్వానిదే నిర్ణయం:వెంకయ్య
కాకినాడ:ప్రత్యేక తెలంగాణపై తమ పార్టీకేంద్ర నాయకత్వమే నిర్ణయంతీసుకుంటుందని భారతీయ జనతా పార్టీ(బిజెపి) మాజీ జాతీయాధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. పార్టీరాష్ట్ర కార్యవర్గ సమావేశానికిఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సరైనఅవగాహన ఉంటేనే తెలుగుదేశంపార్టీతో పొత్తు ఉంటుందని ఆయన అన్నారు.దేశాన్ని ఎవరు పాలిస్తున్నారో అర్థంకావడం లేదని, విధాన నిర్ణయాలు కూడాప్రధాని కాకుండా వేరేవాళ్లుతీసుకుంటున్నారని ఆయనవ్యాఖ్యానించారు.
గవర్నర్వ్యవస్థను కేంద్ర ప్రభుత్వందుర్వినియోగం చేస్తోందని,గవర్నర్లను తన ఏజెంట్లుగామార్చుకుంటోందని ఆయన విమర్శించారు.కాంగ్రెస్ తన పాత అలవాట్లను, పాతవాసనలను వదిలించుకోలేదని ఆయనఅన్నారు. అక్రమాలతో లుకలుకలాడుతున్నలాలూ ప్రసాద్ యాదవ్ తప్ప కాంగ్రెస్పార్టీని సమర్థించడానికి ఎవరూ సిద్ధంగాలేరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
