మున్సిపల్ఎన్నికల్లో 75 శాతం మావే: కేశవరావు
ద్వారకాతిరుమల:వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ 75శాతం సీట్లు గెలుచుకుంటుందని ప్రదేశ్కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుడాక్టర్ కె. కేశవరావు ధీమావ్యక్తం చేశారు. స్థానిక సంస్థలఎన్నికలకు తాము పూర్తిగాసిద్ధమవుతున్నామని ఆయనవిలేకరులతో చెప్పారు. ఆయన ఆదివారంద్వారకా తిరుమలను సందర్శించారు.మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులను స్థానికనాయకత్వమే ఎంపిక చేస్తుందని,తమ జోక్యం ఏమీ ఉండదని ఆయనచెప్పారు. అభ్యర్థుల ఎంపికలో విభేదాలుతలెత్తితే జిల్లా కాంగ్రెస్ కమిటీ(డిసిసి)లు జోక్యం చేసుకుని పరిష్కరిస్తాయనిఆయన చెప్పారు.
తెలుగుదేశంఅకృత్యాలను అరికట్టడమే కాంగ్రెస్లక్ష్యమని ఆయన పశ్చిమ గోదావరి జిల్లాపార్టీ కార్యకర్తల సమావేశంలోఅన్నారు. పదేళ్లు తెలుగుదేశం వారురాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ఆయనఅన్నారు. ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయనచెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్సరఫరా విషయంలో ప్రతిపక్షాలుచేస్తున్న విమర్శల్లో సత్యం లేదనిఆయన అన్నారు. ఐదేళ్లలో నీటి పారుదలప్రాజెక్టులు పూర్తి చేస్తే తమకుపుట్టగతులుండవని తెలుగుదేశంభయపడుతోందని, అందుకే వాటికిఅడ్డు పడే ప్రయత్నం చేస్తోందనిఆయన అన్నారు.