తొలి టెస్టుకు యువరాజ్, నెహ్రాలు దూరం
కోల్కత్తా: పాకిస్థాన్తో మంగళవారం ప్రారంభమయ్యే తొలి టెస్టులో ఆడే భారతజట్టులో యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రాకు స్థానం దక్కలేదు. పాకిస్థాన్తో ఆడే 12 మంది భారత క్రికెట్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెలెక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. జట్టులో కొత్తవారెవరూ లేరు. పాకిస్థాన్, భారత్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ మంగళవారంనాడు మొహాలీలో ప్రారంభమవుతుంది. భారత్ ఇద్దరు పేస్ బౌలర్లతో, ఇద్దరు స్పిన్నర్లతో మైదానంలోకి దిగే అవకాశం ఉంది. దీంతో లక్ష్మీపతి బాలాజీ పెవిలియన్కే పరిమితం కావచ్చు. లక్ష్మణ్ బ్యాటింగ్పై కెప్టెన్ గంగూలీ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
జట్టు
సౌరబ్ గంగూలీ (కెప్టెన్), రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వివియస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్, దినేష్ కార్తిక్, అనిల్ కుంబ్లే, జహీర్ఖాన్, ఇర్ఫాన్పఠాన్, హర్బజన్ సింగ్, లక్ష్మీపతి బాలాజీ.