వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరణించినమావోయిస్టులకు పోస్ట్మార్టం
హైదరాబాద్:ఈ జిల్లాలోని మానాల అడవుల్లో నిన్న జరిగినఎన్కౌంటర్లో మరణించిన పదిమంది మావోయిస్టులమృతదేహాలకు మంగళవారం పోస్టుమార్టంనిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరువెళ్ళేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మావోయిస్టు ప్రతినిధులుకళ్యాణరావు, బండ ప్రకాష్, సంధ్యతదితరులను పోలీసులు మార్గంమధ్యలోనే అరెస్టు చేసి ఆ తర్వాతవిడుదల చేశారు. వీరిని అరెస్టు చేయడంఅన్యాయమని విప్లవ రచయితవరవరరావు హైదరాబాద్లోఖండించారు.
న్యాయమూర్తిసమక్షంలోనే పోస్టుమార్టం చేసినట్టుహోంమంత్రి జానారెడ్డి మంగళవారంహైదరాబాద్లో చెప్పారు.అవసరమనుకుంటే తిరిగి పోస్టుమార్టంనిర్వహించడానికైనా సిద్ధమని ఆయనఅన్నారు. పోస్టు మార్టం సందర్భంగాఅనవసర గొడవలు నివారించేందుకేకళ్యాణరావు తదుతరులను అరెస్టుచేశారని, కొన్ని గంటలకే వారిని విడుదల చేశారని ఆయనచెప్పారు.
Story first published: Tuesday, March 8, 2005, 23:53 [IST]