చిలకలూరిపేట సంఘటనదురదృష్టకరం:వైఎస్
హైదరాబాద్:చిలకలూరిపేటలో పోలీసులను మావోయిస్టులు నరికిచంపడం దురదృష్టకరమని, దీనినిఖండిస్తున్నానని ముఖ్యమంత్రి డాక్టర్రాజశేఖరరెడ్డి శనివార ఉదయంవ్యాఖ్యానించారు. నిన్న రాత్రి నక్సలైట్ల దాడిలో మరణించినఏడుగురి కుటుంబసభ్యులనుపరామర్శించేందుకు డాక్టర్వైఎస్ రాజశేఖరరెడ్డి, హోంమంత్రిజానారెడ్డి చిలకలూరి పేట బయలుదేరి వెళ్ళారు. జీపులుసుమోలలో వచ్చిన సుమారు అరవై మందిమావోయిస్టులుశుక్రవారం రాత్రి పదకొండు గంటలప్రాంతంలో చిలకలూరిపేట పోలీసు స్టేషన్పై దాడిచేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ప్రసాద్ను,హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్,హోంగార్డు,క్లర్క్, ఎస్ఐ తల్లిని, ఒక స్ధానికుడినిచంపేశారు. వాహనాల్లోబాంబులు, వేటకొడవళ్ళు, తుపాకులతో పోలీసు స్టేషన్,పోలీసు క్వార్టర్లు ఉన్నప్రాంతానికి వచ్చిన నక్సలైట్లుఅక్కడున్న వారందరినీ వెళ్ళిపొమ్మనిచెప్పి బాంబులు వేశారు. ఆ సమయంలో ఒకనిందితుడిని ఇంటరాగేట్ చేస్తున్న సిఐప్రసాద్ను వేటకొడవళ్ళతో నరికి చంపారు. అక్కడే ఉన్న ఎస్ఐతప్పించుకుని గుంటూరు పారిపోయాడు.ఎస్ఐ క్వార్టర్పై దాడి చేసిన నక్సలైట్స్ అతని తల్లినినరికి చంపారు. పారిపోయిన ఎస్సై ఇతరకుటుంబ సభ్యులను పోలీసు అధికారులుసురక్షిత ప్రాంతానికి తరలించారు.












Click it and Unblock the Notifications
