వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్లో భారీ పేలుడు: 12 మంది దుర్మరణం
శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా పట్టణంలో సోమవారం జరిగిన భారీ పేలుడులో 12 మంది మరణించారు. ఇందులో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటనలో 100 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని భావిస్తున్నారు.
పుల్వామాలోని మార్కెట్ స్థలంలో ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో మిలిటెంట్లు శక్తివంతమైన ఐ ఇడిలను పేల్చింది. భద్రతా వాహనాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ పేలుళ్లకు వారు పాల్పడినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ గోపాల్ శర్మ చెప్పారు. ఆత్మాహుతి దళం దీనికి పాల్పడి వుండవచ్చునని అనుమానిస్తున్నారు. ట్రక్కులో పెట్టిన శక్తివంతమైన బాంబులు పేలడంతో ఈ ఘోరం సంభవించింది. ఈ సంఘటనకు ఎవరు కారణమనేది ఇప్పటి వరకు తేలలేదు. పాకిస్తాన్ అనుకూల హిజ్బుల్ ముజాహిదీన్ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చునని అంటున్నారు.
Comments
Story first published: Monday, June 13, 2005, 23:53 [IST]