వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ధరల పెంపు దుర్భరమే అయినా అనివార్యం: కెకె
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దుర్భరమే అయినా అనివార్యమైందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. మున్సిపాలిటీల ఎన్నికలపై ఆయన సోమవారం జిల్లాల ఇన్చార్జి మంత్రులతో చర్చించారు. ఎన్నికల కోసం మున్సిపాలిటీలవారీగా కమిటీలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఇన్చార్జి మంత్రులు, పిసిసి ప్రతినిధులు ఉంటారని ఆయన చెప్పారు. ఈ కమిటీల ఏర్పాటు జులై ఆఖరు నాటికి పూర్తవుతాయని ఆయన చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర స్థాయిలో ఒక సమన్వయ కమిటీని వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీలో ప్రభుత్వం తరఫున ముగ్గురు, పార్టీ తరఫున ముగ్గురు ఉంటారని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తల అభిమతానికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Monday, June 20, 2005, 23:53 [IST]