వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వింబుల్డన్ తొలి రౌండ్లో సానియా గెలుపు
లండన్: వింబుల్డన్ మహిళా సింగిల్స్ తొలి రౌండ్లో హైదరాబాద్ టెన్నిస్ తార విజయం సాధించి రెండో రౌండ్కు చేరుకుంది. మొదటి సెట్ గెల్చుకుని రెండో సెట్లో ఓడిపోయిన సానియా ఆ తర్వాత విజృంభించి ఆడింది. జపాన్ క్రీడాకారిణి మొరిగామికి, సానియాకు మధ్య తొలి రౌండ్ పోరు హోరాహోరీగా జరిగింది. సానియా మొరిగామిపై 6-3, 3-6, 8-6 స్కోర్తో గెలిచింది. రెండో రౌండ్లో సానియా స్వెత్లానా కుజెనెత్సోవాతో తలపడుతుంది.
Comments
Story first published: Monday, June 20, 2005, 23:53 [IST]