For Daily Alerts
బస్సు లోయలో పడి 18 మంది దుర్మరణం
ధర్మశాల: హిమాచల్ప్రదేశ్లో ఒక ప్రైవేట్ బస్సు లోయలో పడి అందులో ప్రయాణిస్తున్న 18 దుర్మరణం పాలయ్యారు; 20 మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగింది. గుజరాత్లోని వడదొరలో బియస్యన్యల్ ఉద్యోగులను ఎక్కించుకుని మనాలి వెళ్తున్న బస్సు చారంఖుడ్లో పడిపోయినుట్లు పోలీసులు చెప్పారు. ఈ బస్సులో ఎంత మంది ప్రయాణిస్తున్నారనేది కచ్చితంగా తెలియదు.
ఇప్పటి వరకు 18 శవాలను వెలికితీశారు. గాయపడినవారిని దగ్గరలోని జోనల్ ఆస్పత్రిలో చేర్చారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మలుపులో బస్సును నియంత్రించడంలో డ్రైవర్ విఫలం కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగి వుంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Story first published: Tuesday, June 21, 2005, 23:53 [IST]