వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్‌పై అమ్మకం పన్ను పెంపు నేనెరుగ: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం సందులో సడేమియా లాగా పెట్రోల్‌, డీజిల్‌లపై అమ్మకం పన్నును పెంచింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని ఆసరాగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా అమ్మకం పన్ను పెంచింది. పెట్రోల్‌పై అమ్మకం పన్నును రాష్ట్ర ప్రభత్వుం 32 నుంచి 55 శాతం వరకు పెంచింది. డీజిల్‌పై 34 శాతం పెంచింది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా వంద కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై అమ్మకం పన్నును పెంచుతూ ప్రభుత్వ ఉన్నతాధికారి హరిహరన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే అమ్మకం పన్ను పెంపు గురించి తనకు తెలియదని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. తనకు ఈ విషయం ఏమీ తెలియదని, దీనికి సంబంధించిన వివరాలను తాను చూడాల్సి ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి తెలియకుండా పెట్రోల్‌, డీజిల్‌ లపై అమ్మకం పన్ను పెరుగుతుందా అనేది అనుమానం. పెట్రోల్‌పై అమ్మకం పన్ను పెంపుతో రాష్ట్రంలో లీటర్‌ పెట్రోల్‌ ధర మూడున్నర రూపాయలు పెరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X