రుజువు చేస్తే మొత్తం భూమి రాసిస్తా: కోడెల
గుంటూరు: ఆలయ భూములను తాను అక్రమంగా కొనుగోలు చేసినట్లు రుజువు చేస్తే మొత్తం ప్రభుత్వానికి రాసిస్తానని తెలుగుదేశం నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. ఆలయ భూములను తాను అక్రమంగా కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు ఆ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసుకోవచ్చునని ఆయన అన్నారు. తన సవాల్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే జిల్లా కలెక్టరేట్కు రావాలని ఇటీవల సవాల్ చేసిన ఆయన సోమవారం కలెక్టరేట్కు వచ్చారు.
గజం 30 వేల రూపాయల విలువ చేసే ఆలయ భూములను తాను అతి తక్కువ ధరకు కొనుగోలు చేశానని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, తాను ఆ భూములను గజం 27,500 రూపాయల ధరకు కాంగ్రెస్ నాయకులను విక్రయించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలకు, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా, వేలం తదితర పద్ధతులకు భిన్నంగా తాను ఆలయ భూములను కొనుగోలు చేసినట్లు రుజువు చేస్తే మొత్తం భూమిని ప్రభుత్వానికి రాసిస్తానని ఆయన అన్నారు.