వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టు ఆదేశాలు ఎదురుదెబ్బ కాదు: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలు తనకు ఎదురుదెబ్బ ఏమీ కాదని, ఇందులో ఆందోళన చెందాల్సిందేమీ లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎల్‌.కె. అద్వానీ అన్నారు. ఈ కేసులో కొన్నేళ్లుగా నడుస్తోందని, మరి కొంత కాలం నడుస్తుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ కేసులో మరికొంత మంది పేర్లు కూడా ఉన్నాయని, అదంతా న్యాయవాదులు చూసుకుంటారని, ఈ విషయంలో తాను చేయాల్సింది చాలా తక్కువ అని ఆయన అన్నారు. అద్వానీ రేపు అయోధ్య సందర్శించనున్నారు.

అలహాబాద్‌ కోర్టు ఆదేశాల ప్రభావం పార్టీపై ఏ విధంగానూ ఉండదని ఆయన అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీకి విముక్తి ప్రసాదిస్తూ రాయ్‌బరేలీ కోర్టు ఆదేశాలివ్వడాన్ని అలహాబాద్‌ హైకోర్టు తప్పు పట్టింది. బిజెపి నేతలు మురళీ మనోహర్‌ జోషీ, ఉమాభారతి, వినయ్‌ కతియార్‌, విహెచ్‌పి నాయకులు అశోక్‌ సింఘాల్‌, గిరిరాజ్‌ కిశోర్‌, విష్ణు హరి దాల్మియా, సాధ్వి రితంబరలు పెట్టుకున్న రివిజన్‌ పిటిషన్లను కూడా హైకోర్టు తోసి పుచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X