అల్పపీడనంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగవచ్చునని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కరుస్తున్నాయి. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై నీరు చేరింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెప్పారు. రాయలసీమలోనూ, మిగతా జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం కురిసే అవకాశాలున్నట్లు వారు తెలిపారు. నైరుతి రుతుపవనాలు విఫలమైన నేపథ్యంలో అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలు ఉపయోగకరంగానే ఉంటాయని భావిస్తున్నారు.
ఇదిలావుంటే, కర్ణాటకలోని ఆల్మట్టి రిజర్వాయర్ నిండింది. ఆల్మట్టి క్రస్ట్ గేట్లు తెరిచారు. దీంతో నారాయణపూర్ రిజర్వాయర్కు నీరు వదిలారు. ఈ రిజర్వాయర్ నుంచి నీరు వదులుతున్నారు. రేపటికి ఆంధ్రప్రదేశ్లోని జురాల రిజర్వాయర్కు నీరు చేరుకుని అవకాశం ఉంది.