మరిన్ని నక్సల్స్ డంప్లు: నలుగురు అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్లో మరిన్ని నక్సలైట్ల ఆయుధాల డంప్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గురువారంనాడు హైదరాబాద్ జనశక్తి నక్సలైట్ల డంప్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు శుక్రవారంనాడు ప్రతిఘటన దళానికి చెందిన డంప్లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీసులు శుక్రవారంనాడు దాడులు నిర్వహించి నక్సలైట్లకు చెందిన రెండ్ డంప్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం. హైదరాబాద్లోని సీతాఫల్మండిలో, ఎల్బి నగర్సమీపంలోని మీర్పేటలో పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారంనాడు కరీంనగర్ జిల్లా పోలీసులు హైదరాబాద్లో సోదాలు నిర్వహించి జనశక్తి డంప్లను పట్టుకోగా, శుక్రవారం వరంగల్ జిల్లా పోలీసులు దాడులు చేసి ప్రతిఘటన నక్సల్స్ డంప్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు ప్రతిఘటన నక్సలైట్ల అరెస్టును రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ మీడియా ప్రతినిధుల సమావేశంలో ధృవీకరించారు. వరంగల్ పోలీసులను ఆయన అభినందించారు.
మీర్పేటలో మోహన్రెడ్డి, రమాదేవి దంపతులు ఒక ఇంటిని ఇటీవల కొన్నారు. ఈ ఇంటి నుంచి గురువారం రాత్రి ప్రతిఘటన కొరియర్ డబ్బులు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. మోహన్ రెడ్డి దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతిఘటన డంప్ల నుంచి పోలీసులు లక్షలాది రూపాయల నగదును, ఫిక్స్డ్ డిపాజిట్ల బాండ్లను, బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే, వరంగల్లోని కాశిబుగ్గ కాలనీలోని ఇఫ్టు అధ్యక్షుడు దయాకర్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు.
పోలీసులు అరెస్టు చేసిన రవి, మధుసూదన్ రెడ్డి, నగేష్, అరుణలను వెంటనే కోర్టులో హాజరు పరచాలని సిపిఐ(యంయల్) న్యూడెమొక్రసీ నాయకుడు గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిని కోర్టులో హాజరు పరచాలని మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు బుర్రా రాములు, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి శేషయ్య కూడా డిమాండ్ చేశారు.