వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాలమూరు జిల్లాలో లాకప్డెత్: విచారణ
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో లాకప్ డెత్ సంభవించింది. హత్య కేసులో కేసులో పోలీసులకు లొంగిపోయిన నర్సింహులు శవమై తేలాడు. మహబూబ్నగర్ జిల్లా పాన్గల్ పోలీసు స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. చుక్కపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తిపై పోలీసులు హత్య కేసు పెట్టారు. నేరాన్ని అంగీకరిస్తూ నర్సింహులు తనంతట తాను వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. అయితే అతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ సంఘటనపై విచారణ జరపాల్సిందిగా మహబూబ్నగర్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) విక్రమసింగ్ మాన్ డియస్పిని ఆదేశించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా నర్సింహులు మరణించాడని యస్పీ అంటున్నారు.
Comments
Story first published: Monday, July 11, 2005, 23:53 [IST]