ఉత్తమ తెలుగు చిత్రం స్వరాభిషేకం
న్యూఢిల్లీ: ఉత్తమ తెలుగు చిత్రంగా కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వర్ణాభిషేకం ఎంపికయింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా స్వర్ణాభిషేకం చిత్రానికి సంగీతం కూర్చిన విద్యాసాగర్ ఎంపికయ్యారు. వార్షిక జాతీయ చలనచిత్ర అవార్డులను బుధవారం ప్రకటించారు. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం అవార్డును చిరంజీవి నటించిన అంజి గెలుచుకుంది. ఉత్తమ నటుడిగా సైఫ్ అలీఖాన్, ఉత్తమ నటిగా కన్నడ నటి తార ఎంపికయ్యారు. కునాల్ కోహ్లి దర్శకత్వం వహించిన హమ్ తుమ్ అనే చిత్రంలోని నటనకుగా సైఫ్కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించిన హసీనా చిత్రంలోని నటనకుగాను తారకు ఉత్తమ నటి అవార్డు లభించింది. హసీనాకు కుటుంబ సంక్షేమ అవార్డుల విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డు కూడా లభించింది.
బెంగాలీ సినిమా స్వప్నేర్ దిన్కు దర్శకత్వం వహించిన బుద్దదేవ్ దాసు గుప్తాకు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. పేజ్ 3 ఉత్తమ సినిమాగా ఎంపికయింది. యాష్ చోప్రా వీర్ జారా సినిమా, చరణ్ ఆటోగ్రాఫ్ తమిళ చిత్రం బెస్ట్ పాపులర్ సినిమా అవార్డును పంచుకున్నాయి. ఉత్తమ నేపథ్య గాయకుడిగా స్వదేశ్లెని ఎహ్ తారా అనే పాటకు ఉదిత్ నారాయణ్, ఉత్తమ నేపథ్య గాయనిగా ఆటోగ్రాప్లో పాడిన పాటకు చిత్ర ఎంపికయ్యారు. సుభాష్ చంద్రబోస్ ఉత్తమ జాతీయ సమైక్యతా అవార్డు గెలుచుకుంది.