పాక్లో ఘోర రైలు ప్రమాదం: 300 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 300 మందికిపైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. కరాచీకి 600 కిలోమీటర్ల దూరంలో గల సింధు ప్రొవిన్స్లో బుధవారం తెల్లవారుజామున మూడు రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో 300 మంది దాకా మరణించి వుంటారని పోలీసులు చెప్పినట్లు పాకిస్థాన్కు చెందిన యన్యన్ఐ వార్తాసంస్థ తెలియజేసింది. 13 రైలు క్యారేజీలు పట్టాలు తప్పి ధ్వంసమయ్యాయని పాకిస్థాన్ రైల్వేల చైర్మన్ షకీల్ దుర్రాని ప్రభుత్వ ఆధ్వర్యంలోని పిటివికి చెప్పారు. బుధవారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో లాహోర్ నుంచి వచ్చిన కరాచీ ఎక్ప్ప్రెస్ షర్హాద్ స్టేషన్లో ఆగి వున్న క్వయెట్టా ఎక్ప్ప్రెస్ను ఢీకొట్టింది. దీంతో 13 బోగీలు పట్టాలు తప్పి పక్క ట్రాక్పై పడ్డాయి. ఇదే సమయంలో షర్హాద్ మీదుగా వెళ్తున్న తెజ్గామ్ ఎక్ప్ప్రెస్ ఆ బోగీలను ఢీకొట్టింది.
బోగీల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ప్రయాణికులను వెలికి తీసే కార్యక్రమం చురుకుగా సాగుతోందని, సహాయక చర్యలను వెంటనే చేపట్టామని పాకిస్థాన్ రైల్వే జనరల్ మేనేజర్ అబ్దుల్ భావ్ పిటికి చెప్పారు. ప్రమాదం సంభవించిన సమయంలో చాలా ప్రయాణికులు నిద్రలో మునిగివున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు దుర్రాని చెప్పారు. మానవ వైఫల్యమే ప్రమాదానికి కారణమని రైల్వే అధికారులంటున్నారు. షర్షాద్ రైల్వే స్టేషన్ సిగ్నల్ను సరిగ్గా గుర్తించడంలో కరాచీ ఎక్ప్ప్రెస్ డ్రైవర్ విఫలమయ్యాడని అధికారులు చెబుతున్నారు.