వోక్స్ వ్యాగన్ ఒప్పందాలు వెల్లడించాలి: టిడిపి
హైదరాబాద్: జర్మనీ కంపెనీ వోక్స్ వ్యాగన్తో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను చూపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారు సోమయాజులను కలిసి వారు ఈ మేరకు బుధవారం డిమాండ్ చేశారు. ఆ పత్రాలన్నీ మంత్రి బొత్సా సత్యనారాయణ వద్దనే ఉన్నాయని సోమయాజులు తెలుగుదేశం నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తదితరులకు చెప్పారు.
వోక్స్ వ్యాగన్ వ్యవహారం ప్రభుత్వాన్నికి తలనొప్పిగా మారిందని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి బుధవారంర విలేకరుల సమావేశంలో అన్నారు. వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో ఎంత పెద్దవారైనా తప్పు చేసిన వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడానికి సరైన వాళ్లను, సరైన పద్ధతిని ఎంపిక చేసుకొని ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. బినామీ కంపెనీకి ఇచ్చామని, ఆ వ్యక్తి చిరునామా కూడా తెలియదంటున్నారని ఆయన అన్నారు.