ఐశ్వర్యకు సల్మాన్ బెదిరింపులపై విచారణ: సియం
ముంబాయి: బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ను నటుడు సల్మాన్ ఖాన్ బెదిరించాడనే ఆరోపణలపై విచారణ జరిపించినున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్రావు దేశ్ముఖ్ చెప్పారు. అండర్వరల్డ్కు సంబంధించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని సల్మాన్ ఖాన్ ఐశ్వర్యారాయ్ను బెదిరించినట్లు రుజువులున్నాయని చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేశారు.
గురువారం శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రతిస్పందిస్తూ ఈ వ్యవహారంపై తాను తర్వాత ఒక ప్రకటన చేస్తానని హామీ ఇచ్చారు. ఐశ్వర్యారాయ్ను బెదిరించినందుకు, అండర్వరల్డ్ సంబంధాలు ఉన్నందుకు సల్మాన్ ఖాన్పై మోకా కింద కేసు నమోదు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఐశ్వర్యారాయ్ను బెదిరిస్తూ సల్మాన్ఖాన్ ఫోన్లో చేసిన హెచ్చరికల టేప్లు ముంబాయి పోలీసుల వద్ద ఉన్నాయని బిజెపి పక్ష నాయకుడు గోపీనాథ్ ముండే అన్నారు. ఈ టేప్ల సంభాషణలను ఒక దినపత్రిక గురువారంనాడు ప్రచురించింది. దావూద్ ఇబ్రాహీం, అతని అనుచరుడు చోటా షకీల్కు సంబంధించిన కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వాలని ఐశ్వర్యారాయ్ను సల్మాన్ ఖాన్ బెదిరించినట్లు దాన్ని బట్టి తెలుస్తోంది.