వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రి బొత్సకువైఎస్ కితాబు
హైదరాబాద్:వోక్స్వ్యాగన్ ఉదంతంలో మంత్రిబొత్స సత్యనారాయణ నిర్దోషి అనిముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శనివారంఇక్కడ కితాబు ఇచ్చారు. వశిష్ట వాహన్సంస్ధకు ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు చెల్లించేలాచేసిన వ్యోక్స్ వ్యాగన్ప్రతినిధి షూష్ట్లరే ఈ ఉదంతంలో ప్రధాననిందితుడని ప్రాధమికసాక్ష్యాధారాలను బట్టితెలుస్తోందన్నారు. ఈ కేసును దేశంలోనే అత్యున్నతవిశ్వసనీయత గల సిబిఐకిఅప్పగించినందువల్ల త్వరలో నిజానిజాలుబయటపడతాయని రాజశేఖరరెడ్డిఅన్నారు. బొత్స సత్యనారాయణ గురించిపత్రికలే పనిగట్టుకుని తప్పుడు వార్తలురాస్తున్నాయని ఆయన ఆరోపించారు.తెలుగుదేశం హయాంలో ఎన్నో కుంభకోణాలుజరిగినా, దర్యాప్తులను చంద్రబాబు నాయుడునీరుగార్చారని,తాము మాత్రం నిజాయితీగా దర్యాప్తు చేయిస్తున్నామని ఆయన అన్నారు.
Comments
Story first published: Saturday, July 16, 2005, 23:53 [IST]