క్లెయిమాక్స్లోతెలంగాణ రాష్ట్ర సాధన: కెసిఆర్
హైదరాబాద్:టిఆర్ఎస్ మంత్రుల రాజీనామాలుతెలంగాణ రాష్ట్ర సాధనలో చివరి దశఅని టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావుఅభివర్ణించారు.వరంగల్ సభ చివరిది కాదని,తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు బహిరంగసభలు పెడుతుంటామనిఆయన శనివారం ఇక్కడ మీడియాప్రతినిధులకు చెప్పారు.ఏకాభిప్రాయంతోనే తెలంగాణ అన్నదితప్పు అని తెలంగాణ ఏర్పాటుకువిస్తృతాభిప్రాయం చాలని, కాంగ్రెస్అధిష్టానవర్గం చెబుతున్నదివిస్తృతాభిప్రాయం గురించేనని, ఇంగ్లీషు అర్ధం కాకమీడియాలో ఏకాభిప్రాయం అనిరాస్తున్నారని ఆయన వివరించారు.తెలంగాణ వ్యతిరేకశక్తులు ఉద్యమాన్నిదెబ్బతీయడానికిప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.ఢిల్లీ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిలోమార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణరాష్ట్ర సాధన కోసం మడమ తిప్పని పోరాటంచేస్తామని, రాజీపడేది లేదనిఆయన చెప్పారు. టిఆర్సిసి తెలంగాణఅభివృద్ధికి రెండు వేల కోట్ల ప్యాకేజినికోరడంపై వ్యాఖ్యానించమని కోరగాఎవరెవరో ఏదో కోరితే దానిపై తాను వ్యాఖ్యానించేదేమిటని ఆయనదాటవేశారు.












Click it and Unblock the Notifications
