వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రధాని అమెరికాయానం: ఘనంగా వీడ్కోలు
న్యూఢిల్లీ:మూడురోజుల అమెరికా పర్యటనకు బయలుదేరినప్రధాని మన్మోహన్ సింగ్కు కాంగ్రెస్అధ్యక్షురాలు సోనియాగాంధీ, మంత్రివర్గసహచరులు ఘనంగా వీడ్కోలు పలికారు. అమెరికాతో సంబంధాలనుమెరుగుపరుచుకోడానికి భారత్ అధికప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగామన్మోహన్ సింగ్ అన్నారు. ప్రధానికిస్వాగతం పలికిన వారిలో ప్రణబ్ ముఖర్జీ,శివరాజ్ పాటిల్, అర్జున్ సింగ్, లాలూప్రసాద్ యాదవ్, గులాం నబీ ఆజాద్,జైపాల్రెడ్డి ఉన్నారు. భారతదేశంలోని అమెరికా వ్యవహారాలఇన్చార్జి రాబర్ట్ క్లార్క్ కూడా మన్మోహన్వీడ్కోలు సభకు హాజరయ్యారు.
భారత ప్రధానిమన్మోహన్ సింగ్, అమెరికాఅధ్యక్షుడు జార్జి బుష్ల సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లోచారిత్రకమలుపు కాగలదన్న ఆశాభావాన్ని ఒకఅమెరికన్ అధికారి వ్యక్తం చేశారు.
Comments
Story first published: Saturday, July 16, 2005, 23:53 [IST]