వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మొద్దు శ్రీను అరెస్టుపై చేతులెత్తేసిన సిబిఐ
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను అరెస్టు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) చేతులెత్తేసింది. మొద్దు శ్రీనును ఆగస్టు 4వ తేదీ లోగా అరెస్టు చేయాలని, లేదంటే కేసును విడదీస్తామని కోర్టు సిబిఐ ఇంతకు ముందు తెలియజేసింది. అయితే తాము మొద్దు శ్రీను అరెస్టు చేయలేకపోయామని అంగీకరిస్తూ కేసున విడదీసి విచారణ జరిపాలని సిబిఐ కోర్టును కోరింది.
పరిటాల రవి హత్య కేసు విచారణను కోర్టు ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. సూరితో పాటు మిగతా నిందితుల రిమాండ్ను ఈ నెల 8వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. మొద్దు శ్రీను దొరకకపోయినా కేసులో చార్జిషీట్ దాఖలు చేస్తామని సిబిఐ తెలియజేసింది.
Comments
Story first published: Thursday, August 4, 2005, 23:53 [IST]