కాంగ్రెస్ సాధించినమునిసిపాలిటీలు జిల్లాల వారీగా
హైదరాబాద్:మున్సిపాలిటీ,నగరపాలక సంస్థల ఎన్నికల్లో తమపార్టీ విజయం తమ ప్రభుత్వ విధానాలకుప్రజలు ఇచ్చిన మద్దతు అని ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిఅన్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్నఅసత్య ఆరోపణలకు ఇది సమాధానమనిఆయన సోమవారం మీడియా ప్రతినిధులసమావేశంలో అన్నారు. తెలుగుదేశంపార్టీ అసత్య ప్రచారానికి, దానికిమద్దతు ఇస్తున్న మీడియాలోని ఒకసెక్షన్కు మున్సిపాలిటీ ఎన్నికల్లో తమవిజయం ఒక సమాధానమని ఆయనఅన్నారు. రెఫరెండం అనే మాటను చాలాఅనాలోచితంగా వాడుతున్నారని, ఏఎన్నికలైనా ప్రజల అభిప్రాయాన్ని ప్రతిఫలిస్తాయనితాను అన్నానని ఆయన అన్నారు.
మున్సిపాలిటీఎన్నికల్లో తమ పార్టీ విజయం ప్రజలవిజయమని, పార్టీ కార్యకర్తల విజయమనిఆయన అన్నారు. తాను చెప్పిన దాని కన్నారెండు మున్సిపాలిటీలను తమ పార్టీఎక్కువ గెలుచుకుందని, ఇది ప్రజలకుతమ ప్రభుత్వంపై గల విశ్వాసమనిఆయన అన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజలఅభిప్రాయం ఈ ఎన్నికల్లో చాలా గట్టిగావ్యక్తమైందని ఆయన అన్నారు. సిపిఐ,సిపియంలకు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె.కేశవరావుకు, మంత్రులకు, పార్టీశాసనసభ్యులకు ఆయన ధన్యవాదాలుతెలిపారు.
ఈఎన్నికల విజయంతో ప్రజాసేవకు తాము తిరిగిపునరంకితమవుతామని ఆయనఅన్నారు. తాము చేపట్టిన జలయజ్ఞానికి ఇదిప్రజల మద్దతుగా తాము భావిస్తున్నామనిఆయచ చెప్పారు. తాము ఇచ్చిన హామీలనుఅమలు పరిచే దిశలో సాగుతున్నామని ప్రజలునమ్మారని ఆయన అన్నారు. తాము మంచిపనులు చేసినా తెలుగుదేశం పార్టీవారుపనిగట్టుకుని అసత్య ప్రచారం చేశారని,దానికి మీడియాలోని ఒక సెక్షన్మద్దతు ఇచ్చిందని, దాన్ని ప్రజలునమ్మడం లేదని రుజువైందని ఆయనఅన్నారు.