వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెరాస నేత నరేంద్రకు హైకోర్టు నోటీసు
హైదరాబాద్: తెలంగాణ జాగరణ సేన (టిజెయస్) ఏర్పాటు సభలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్రకు హైకోర్టు నోటీసు జారీ చేసింది. నరేంద్రకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఆ నోటీసు జారీ చేసింది. టిజెయస్ ఏర్పాటు సభలో రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్పై హైకోర్టు పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)కి, హోం శాఖ కార్యదర్శికి కూడా నోటీసులు జారీ చేసింది.
Story first published: Tuesday, September 27, 2005, 23:53 [IST]