వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిల్పి ఎక్కా యాదగిరిరావుకుసీనియర్‌ ఫెలోషిప్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ప్రముఖ శిల్పి, శిల్పాచార్యులు ప్రొ. ఎక్కా యాదగిరిరావుభారత ప్రభుత్వం,సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శిల్ప విభాగంలోఇచ్చే ప్రతిష్టాత్మక సీనియర్‌ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. రెండేళ్ళకాల వ్యవధి గల ఈ ఫెలోషిప్‌లో భాగంగా నెలకు 12 వేలరూపాయల గౌరవవేతనం కళాకారినికి లభిస్తుంది. దృశ్య కళామాధ్యమాలలోముఖ్యమైనదైన శిల్పకళా విభాగంలో ఒకతెలుగు శిల్పి/ శిల్పాచార్యుడికి ఈ గౌరవం దక్కడం ఇదే ప్రధమం. రెండేళ్ళుకొనసాగే ఈ ప్రాజెక్టులో శిల్పి ఎక్కా యాదగిరిరావు అందుబాటులో ఉండే ముడిపదార్ధాలతో సరికొత్త పద్ధతుల్లో శిల్పరచనకు పూనుకుంటారు. మహబూబ్‌నగర్‌ జిల్లామక్తల్‌లో 1938లో జన్మించిన ఎక్కా యాదగిరిరావుహైదరాబాద్‌ పాత బస్తీలో చిన్ననాటి నుండి విద్యాభ్యాసంచేశారు. భారతీయశిల్పకళారంగానికి గణనీయమైనసేవలు చేసిన ఎక్కా జెఎన్‌టియుసాంకేతిక విశ్వవిద్యాలయం ఫైనార్ట్స్‌విభాగంలో మూడు దశాబ్దాలుగాఅధ్యాపకుడుగా పనిచేసి 1999లో రిటైరయ్యారు. ఎక్కాశిల్పాలు రష్యా,ఆమెరికా, జర్మనీ, బ్రిటన్‌ దేశాల్లో మ్యూజియంలతోపాటు న్యూఢిల్లీలోని నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడర్న్‌ ఆర్ట్‌లోప్రదర్శనార్ధం పెట్టారు. ఎక్కా యాదగిరిరావుకు 2001లో ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం హంస అవార్డు ఇచ్చింది. 1984లోరాష్ట్ర ప్రభుత్వం కళా సరస్వతిఅవార్డు లభించింది. అమెరికాలోని డెట్రాయిట్‌తెలుగు సంఘం 2002లో ఆయననుఘనంగా సత్కరించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X