సెహ్వాగ్ ఓపెనర్గానే దిగుతాడు: ద్రావిడ్
కొచ్చి: వరుసగా విఫలమవుతున్నప్పటికి ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పట్ల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కొచ్చిలో రేపు ఇంగ్లాండుతో జరిగే నాలుగో వన్డే మ్యాచ్లోనూ సెహ్వాగ్ ఓపెనర్గా దిగుతాడని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుత సమయంలో సెహ్వాగ్ టాప్ ఆర్డర్లో మరి కొన్ని అవకాశాలు కల్పించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సెహ్వాగ్ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉందని, అందుకు తాము చేయాల్సిందంతా చేస్తామని ఆయన అన్నారు.
గాయం కారణంగా యువరాజ్ సింగ్ నాలుగో వన్డే ఆడకపోవచ్చునన్న అనుమానాలకు తెరపడింది. భారత బ్యాట్స్మెన్లందరిలో అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్న యువరాజ్ నాలుగో వన్డేకు దూరం కావచ్చుననే ఆందోళన వ్యక్తమైంది. ప్రాక్టీస్లో గాయపడిన యువరాజ్ వెంటనే స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. కాలి వాపుకు ఎంఆర్ఐ స్కాన్ జరిగింది. అయితే రేపటి మ్యాచ్లో ఆడడానికి ఈ గాయం ఆటంకం కాదని వైద్యులు తేల్చారు.