వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టుల బంద్‌కు మిశ్రమ స్పందన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు ఇచ్చిన బంద్‌ పిలుపునకు మిశ్రమ స్పందన కనిపిస్తోంది. తెలంగాణ జిల్లాలో యాభై బస్సు సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న పోలీసు స్టేషన్లకు ప్రత్యేల భద్రత కల్పించారు. మారు మూల ప్రాంతాలకు వెళ్ళే బస్సు సర్వీసులను ఆర్టీసీ రద్దు చేయడంతో గ్రామీణ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. భద్రాచలం- విశాఖపట్నం, భద్రాచలం- రాజమండ్రి బస్సు సర్వీసులు రద్దయ్యాయి. కడప, మహబూబ్‌నగర్‌, ప్రకాశం జిల్లాల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లకు నిరసనగా శని, ఆదివారాలు రెండు రోజులు రాష్ట్ర బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. జనశక్తి పార్టీ కూడా ఆరో తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. మావోయిస్టులు మూడురోజుల నుంచి ప్రతిదాడులకు దిగడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. మావోయిస్టుల ప్రతిదాడులను అడ్డు కునేందుకు కౌంటర్‌ యాక్షన్‌ బృందాలను రంగంలోకి దించినట్లు పోలీ సు ఉన్నతాధికారి ఒకరు వివరించారు. నక్సలైట్ల కదలికలపై నిఘాను పెంచడంతో పాటు పెట్రోలింగ్‌ను, తనిఖీలను ముమ్మరం చేయాలని అన్ని జిల్లాలకూ ఆదేశాలు పంపామని వివరించారు. నక్సలైట్ల టార్గె ట్‌లో ఉన్న ప్రజాప్రతినిధుల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించా లని సూచించామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X