గ్రామ సర్పంచ్ అపహరణ: నక్సల్ప్ పై అనుమానం
వరంగల్: వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామ సర్పంచు కారుకూతల వెంకటయ్యను నలుగురు సాయుధులు సోమవారంనాడు కిడ్నాప్ చేశారు. ప్రజాప్రతిఘటన నక్సలైట్లు ఈ పనికి పూనుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. వెంకటయ్య కిడ్నాప్ పై ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను నలుగురు సాయుధులు కొట్టుకుంటూ తీసికెళ్లారని ఆమె చెప్పింది.
గతంలో జనశక్తి విమోచన పత్రిక బాధ్యతలు నిర్వహించిన పెండ్యాల గోపాలకిషన్ రావును పీవుల్స్ వార్ నక్సలైట్లు ఇప్పటి మావోయిస్టులు హత్య చేశారు. పీపుల్స్ వార్ సానుభూతిపరుడైన వెంకటయ్య పాత్ర ఈ హత్య వెనక ఉందనేది అప్పట్లో జనశక్తి ఆరోపణ. అప్పుడు జనశక్తిలో ఉన్నవారు ఇప్పుడు ప్రజాప్రతిఘటనలో ఉన్నారు. వెంకటయ్య కిడ్నాప్ నకు ఇదే కారణమని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications