వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసి చార్జీలు పెరగువు: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ ఆర్టీసి) బస్సు చార్జీలు పెరగడం లేదు. చార్జీల పెంపునకు ఆర్టీసి చేసిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వెనక్కి పంపారు. ఆర్టీసి అధికారులతో ముఖ్యమంత్రి గురువారం సమీక్ష జరిపారు. రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఆర్టీసి చార్జీలను పెంచడానికి ముఖ్యమంత్రి అంగీకరించలేదని, ముందు కార్యనిర్వాహకాధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారని కన్నా లక్ష్మీనారాయణ మీడియా ప్రతినిధులతో చెప్పారు. పనితీరు మెరుగుకు వారంలో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని ముఖ్యమంత్రి ఆర్టీసి అధికారులను ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X