పోలియో ప్రాజెక్టు సమీక్షకు రామదాస్ హామీ

Central Minister Ramadoss
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో పోలీయో కేసు వెలుగుచూడడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రాందాస్ జాతీయ పోలియో నియంత్రణ ప్రాజెక్టును సమీక్షిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వంటి అంతర్జాతీయ సంస్థలతో కలసి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఏమి చెప్పినా తాము వాటిని అమలు చేస్తున్నాము. గత ఏడాది, ఈ ఏడాది అధిక బడ్జెట్ కేటాయింపు జరిగిన ప్రాజెక్టుల్లో పోలియో కార్యక్రమం కూడా ఒకటని రాందాస్ తెలిపారు. గత ఏడాది ఈ కార్యక్రమానికి బడ్జెట్ కేటాయింపులు రూ.1300 కోట్ల వద్ద ఉండగా, ఈ ఏడాది ఈ కార్యక్రమానికి రూ.1050 కోట్ల నిధులు కేటాయించబడ్డాయని రాందాస్ చెప్పారు.

అయితే ఈ కార్యక్రమం అమలుపై రాందాస్ అంసతృప్తి వ్యక్తం చేశారు. దీనిని సమీక్షిస్తానని అన్నారు. బీహార్ రాష్ట్రంలో పోలియో కేసులు పెరుగుతున్నాయి. అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు త్వరలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తానని రాందాస్ తెలిపారు. గత వారం దేశ రాజధానిలో 14 ఏళ్ల బాలిక పోలియో బారినపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+