ఎన్నికల కోసమే రేషన్ బియ్యం: టిడిపి

రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభిస్తోందని సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి కరీంనగరులో మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ఈ పథకం అమలులో అవకతవకలు జరిగితే ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు అందలేదని, రేషన్ కార్డుల పంపిణీలో కూడా అవకతవకలు జరిగాయని, అందువల్ల రేషన్ బియ్యం పేదలకు అందే అవకాశం తక్కువేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications