గండం గట్టెడానికే వారి మాటలు: కెసిఆర్

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఖతం చేస్తేనే తెలంగాణకు ఊపిరి వస్తుందని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాలో మల్లయ్య అనే రైతు తమకు తెలంగాణ కావాలని చంద్రబాబుతో చెప్పాడని, ఆదిలాబాదు జిల్లాలో చంద్రబాబు ప్రశ్నకు జై తెలంగాణ అని ఒక వ్యక్తి నినాదం చేశాడని, తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారనడానికి ఇంతకన్నా ఏం కావాలని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు తెలంగాణకు రెఫరెండం కాదని ముఖ్యమంత్రి అంటున్నారని, ఆ రకంగా ముఖ్యమంత్రి ఓటమిని ముందే అంగీకరిస్తున్నారని ఆయన అన్నారు. కరీంనగర్ ఉప ఎన్నిక ఒక్కదాన్నే రెఫరెండం అన్న ముఖ్యమంత్రి ఈ ఉప ఎన్నికలు రెఫరెండం కాదని అనడంలో అర్థం లేదని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. జలయజ్ఞం ద్వారా కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications