పెట్రో ధరల పెంపుపై ఆందోళన: దత్తాత్రేయ

కేంద్ర ఫ్రభుత్వ అసమర్థత వల్ల ధరలు పెరిగాయని ఆయన విమర్శించారు. కేంద్ర ఆర్థిక విధానాల లోపం కూడా ధరల పెరుగుదలకు కారణమని ఆయన అన్నారు. సామాన్యులపై, రైతులపై ఈ ధరల పెరుగుదల భారం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రయాణ ఛార్జీలు కూడా పెరిగి ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ఆయన అన్నారు. వంటగ్యాస్ ధర పెంపు వల్ల మహిళా లోకంపై భారం పడుతుందని, ఇప్పటికే గ్యాస్ కొరతతో బాధ పడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications