మహారాష్ట్రలో హైదరాబాదీల మృతి

హైదరాబాద్: మహారాష్ట్రలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాదుకు చెందిన 8 మంది మరణించారు. మరో 7గురు గాయపడ్డారు. అజ్మీర్ దర్గాను సందర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. మృతులు హైదరాబాదులోని గోషామహల్ ప్రాంతానికి చెందినవారు.

అజ్మీర్ దర్గా నుంచి వస్తున్న వీరి క్వాలిస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలో జరిగింది. మృతుల శవాల కోసం హైదరాబాదులోని వారి బంధువులు ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+