తెలంగాణకు వ్యతిరేకం కాదు: బాబు

తెలంగాణపై నాయకులకు, కార్యకర్తలకు సూచనలు చేశామని, తెలంగాణ విషయంలో పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తన మీకోసం యాత్రకు విశేష స్పందన లభిస్తోందని, వచ్చే ఎన్నికల్లో తాము గెలిచి తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు తమకే పట్టం కడతారని ఆయన అన్నారు. పేదలకు మేలు చేయడమే తమ లక్ష్యమని, వారి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. విశాఖపట్నం జిల్లాలో కాంగ్రెస్ శాసనసభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. అక్రమంగా భూములు ఆక్రమిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
