నందినికి పవన్ రు. 5 కోట్లు

పవన్ కళ్యాణ్- నందినిల మధ్య కొంతకాలంగా న్యాయస్ధానాల్లో కేసులు విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవితో పాటు మరో 12 మందిని ఆమె ప్రతివాదులుగా పేర్కొన్నారు. పవన్- నందినిలకు 1997 మార్చిలో పెళ్ళి జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలను నందిని కోర్టుకు సమర్పించింది. కొద్ది కాలానికే వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. కొంతకాలం న్యాయస్ధానాల్లో విచారణలు జరిగిన తర్వాత తనకు 8 కోట్ల పరిహారం ఇవ్వాలని నందిని డిమాండ్ చేసింది. ఇరువైపులా ఉన్న న్యాయవాదులు 5 కోట్లకు కోర్టు వెలుపల పరిష్కారానికి రాజీ కుదిర్చినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications