చిరుతో పొత్తుపై సిపిఎం సమాలోచనలు
హైదరాబాద్: రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించడానికి సిపిం రాష్ట్ర కార్యదర్శివర్గం బుధవారం ఇక్కడ సమావేశమైంది. ఈ సమావేశంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తో పాటు పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి కూడా పాల్గొన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం ప్రభావంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. చిరంజీవి పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై ఈ సమావేశాల్లో చర్చిస్తామని సీతారాం ఏచూరి గతంలోనే చెప్పారు.
ప్రజల్లోకి వెళ్లి వచ్చిన తర్వాతనే తాము పొత్తులపై ఆలోచిస్తామని ప్రజారాజ్యం అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా ఇంతకు ముందు చెప్పారు. అయితే సిపిఎం కార్యదర్శి వర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యాలయానికి మిత్రా వచ్చినట్లు సమాచారం. సిపిఎం నాయకులతో ఆయన మాట్లాడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications