రైళ్లలో పోలీసు తనిఖీలు ముమ్మరం
విజయవాడ: విజయవాడ మీదుగా ఢిల్లీ తదితర ఉత్తరభారత్ నగరాలకు పట్టణాలకు వెళ్లే రైళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈస్ట్కోస్ట్, చెన్నై-పూరీ, ఎర్నాకుళం-రాజేంద్రనగర్, చెన్నై-పాట్నా, జీటీ తదితర రైళ్లలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది వీటిని చేపట్టారు. చెన్నైనుంచి ఉత్తరభారత్ వైపు వెళ్లే రైళ్లలో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నట్లు ఇంటిలిజెన్స్ సమాచారం అందటంతో ఈ తనిఖీలు చేపట్టారు. మరో రెండురోజులపాటు ఈ తనిఖీలు కొనసాగుతాయి.












Click it and Unblock the Notifications