ఖమ్మం జిల్లాలో 3గురు నక్సల్స్ హతం

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందు అటవీ ప్రాంతంలో శుక్రవారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ప్రజాప్రతిఘటన నక్సలైట్లు మరణించారు. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, నక్సలైట్లు ఎదురైనట్లు, ఈ సమయంలో ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.

మృతుల్లో సురేష్ అనే దళ సభ్యుడ్ని మాత్రం గుర్తించారు. మిగతా వారిని గుర్తించాల్సి ఉంది. మోహనన్న దళం ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ దళం కొంత మంది నుంచి డబ్బులు వసూలు చేస్తోందని, కొంత మంది ప్రముఖులను లక్ష్యం చేసుకుందని తెలుస్తోంది. ఈ స్థితిలో పోలీసులు ఈ దళం కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్ నుంచి మోహనన్న తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+