నెలరోజుల్లో పొత్తులు ఖరారు: నారాయణ
గుంటూరు: తెదేపా, పీఆర్పీలు ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న తన ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న ధ్యేయంతోనే తాను ఈ ప్రతిపాదనను తీసుకువచ్చాననీ, అయితే రెండు పార్టీల నుంచీ దీనికి అనుకూల సంకేతాలు రానందున ఈ అంశాన్ని వదిలేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక తెలంగాణకు అనుకూలమని తెదేపా ప్రకటించడం ఎన్నికల ఎత్తుగడేనని నారాయణ వ్యాఖ్యానించారు. నవంబర్ రెండో వారానికల్లా రాష్ట్రంలో పొత్తులు ఓ కొలిక్కి రావచ్చని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications