ఇక కొద్ది రోజులే, ధైర్యంగా ఉండండి: బాబు

నేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన సిరిసిల్లాకు వచ్చే ముందు హైదరాబాదులో అన్నారు. బిసిలను, చేతివృత్తులవారిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నేత కార్మికుల సమస్యలు పరిష్కారమై ఉండేవని ఆయన అన్నారు. తాము పెట్టిన టెక్స్ టైల్ పార్కును నిర్లక్ష్యం చేసి అపారెల్ పార్కు పెడతామని ప్రభుత్వం చెప్పిందని, దాన్ని కూడా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. నేత కార్మికుల పరిస్థితి భయంకరంగా ఉందని ఆయన అన్నారు. పౌష్ఠికాహారం లేక కూడా నేత కార్మికులు మరణిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications