స్టాక్ మార్కెట్ పతనాన్ని ఊహించిన తెలుగువాడు

కాని ఈ మార్కెట్ పదివేల పాయింట్లకు క్రిందికి పోతుందని ముందే ఊహించి విశ్లేషించి చెప్పిన తెలుగువాడు కృష్ణప్రసాద్ కాట్రగడ్డ. అమెరికా ఆర్ధిక వ్యవస్థ మాంద్యం దిశగా పరుగులు తీస్తోందని, ఎవరు ఔనన్నా కాదన్నా ఆర్థిక సంక్షోభం ప్రపంచం మొత్తాన్ని కబళించబోతున్నదని ఆయన ఈ సంవత్సరం జనవరి నెలలోనే హెచ్చరించారు. స్టాక్ మార్కెట్లో నష్టపోకుండా ఉండాలంటే ఎంత త్వరగా కళ్ళు తెరిస్తే అంత మంచిదని ఆయన ఆ రోజునే తెలుగువారిని అప్రమత్తం చేశారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ దిశ చూస్తుంటే కుప్పకూలిపోబోతున్న స్టాక్ మార్కెట్లను నిలువరించడం ఎవ్వరి తరమూ కాదని, వివేకవంతులు వెంటనే స్టాక్లు విక్రయించుకోవడం మంచిదనీ ఆయన జాగ్రత్త చెప్పారు. మరీ ముఖ్యంగా భారత స్టాక్ మార్కెట్ 35వేలకు సైతం వెళ్ళగలదని పెక్కుమంది భారత స్టాక్ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్న సమయంలోనే అమెరికా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్- ఎనలిస్టు అయిన కృష్ణప్రసాద్ కాట్రగడ్డ భారత మార్కెట్ 10వేల పాయింట్లు దిగువకు పడిపోవడం ఖాయమని అప్పుడే చెప్పారు.
శుక్రవారంనాడు అదే జరిగింది. ఆ క్రాష్ను ముందే ఎలా ఊహించారన్న ప్రశ్నకు మార్కెట్ నడకను లోతుగా అధ్యయనం చేయడం వల్ల అది సాధ్యమైందని ఆయన వివరించారు. స్టాక్ మార్కెట్లో సర్వం కోల్పోతున్న కుటుంబాల గురించి బయటి ప్రపంచానికి కొద్ది కొద్దిగానే తెలుస్తున్నదని, కూలిపోతున్న మార్కెట్ వల్ల చితికిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, అటువంటివారు ఇప్పటికైనా మేల్కొనాలని ఆయన హెచ్చరిస్తున్నారు. అమెరికా ఆర్థిక సంక్షోభం గురించి, భారత స్టాక్ మార్కెట్ పతనం గురించీ 10 నెలల క్రిత మే కృష్ణప్రసాద్ కాట్రగడ్డ ఒక టి.వి. ఇంటర్వ్యూలో హెచ్చరించారు.












Click it and Unblock the Notifications