చంద్రయాన్ -1 ప్రయోగం సఫలం

చంద్రయాన్ - 1 ప్రయోగంలో నాలుగేళ్ల భారత శాస్త్రవేత్తల కృషి వుంది. ఉపగ్రహం సరైన కక్ష్యలో ప్రయాణం చేస్తోందని ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్ చెప్పారు. శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఇదొక చారిత్రక ఘట్టమని, ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఈ కలను సాకారం చేసిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ అని ఆయన అన్నారు. బారత శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు కూడా భారత శాస్త్రవేత్తలను అభినందించారు.












Click it and Unblock the Notifications