ఎన్టీఆర్ తో చంద్రబాబు మంతనాలు

Jr Ntr
హైదరాబాద్: ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బుధవారంనాడు మంతనాలు జరిపారు. జూనియర్ ఎన్టీఆర్ గుంటూరులో వచ్చేనెల 5వ తేదీన జరిగే యువగర్జన సదస్సుకు హాజరు కావడంలేదనే వార్తలు వెలువడుతున్న నేఫథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం చేకూరింది. యువగర్జన సదస్సుకు హాజరు కావాలని చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను కోరినట్లు తెలుస్తోంది. ఈ సదస్సుకు గైర్హాజరయితే ప్రజలకు వ్యతిరేక సంకేతాలు అందుతాయని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పష్టమైన హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణలకు మాత్రం హాజరవుతానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

ఇరువురి మధ్య దాదాపు గంటన్నర సేపు చర్చలు జరిగాయి. చంద్రబాబు మంగళవారం సాయంత్రం ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ను బుధవారం ఉదయం అల్పాహార విందుకు ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ బుధవారం ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. గన్నవరం సీటు విషయంలో తన సోదరుడు కళ్యాణ్ రామ్ తో ఏర్పడిన వివాదం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అలిగినట్లు చెబుతున్నారు. హరికృష్ణకు సన్నిహితుడైన దాసరి బాలవర్ధన రావు గన్నవరం శాసనసభ సీటును ఆశిస్తున్నారు. దీంతో ఆయన కళ్యాణ రామ్ తో ఈ నెల 24వ తేదీన బారీ ర్యాలీని తలపెట్టారు. ఇదే సీటును తనకు సన్నిహితుడైన వల్లభనేని వంశీ మోహన్ కు ఇప్పించుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా కళ్యాణ్ రామ్ వ్యవహరించడంపై జూనియర్ ఎన్టీఆర్ అలిగినట్లు చెబుతున్నారు. యువగర్జన సదస్సు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో గన్నవరంలో భారీ ర్యాలీని తలపెట్టినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+