తెలంగాణపై చెప్పే వెళ్తా: చిరంజీవి

తాను ప్రజల గురించి ఆలోచించే వాడినని, అందువల్ల ప్రజల ఆలోచనలేమిటో తెలిసినవడినని ఆయన అన్నారు. తెలంగాణ వీరగడ్డ మీది నిలబడిన తర్వాత తెలంగాణపై చెప్పకుండా ఎలా ఉంటానని ఆయన అన్నారు. చిరంజీవి అందరి కన్నా ఒక్కడుగు ముందున్నాడని గద్దర్ అన్నారని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలే తన ఎజెండా అని, తనకు వ్యక్తిగత ఎజెండాలు లేవని ఆయన చెప్పారు. తెలంగాణ గురించి చెప్పకుండా తాను ఇక్కడి నుంచి వెళ్లబోనని ఆయన అన్నారు. తిరుపతి సభలో తాను తెలంగాణ గురించి చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications