'దేశద్రోహి'పై మహారాష్ట్ర నిషేధం

Deshdrohi
ముంబయి: దేశద్రోహి సినిమాపై మహారాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల పాటు నిషేధం విధించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగవచ్చుననే భయంతో ఈ నిషేధం విధించింది. ఈ నిషేధంపై సినిమా నిర్మాత కోర్టుకెక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెల 14వ తేదీన విడుదల కావాల్సి ఉంది. సినిమా వల్ల శత్రుత్వాన్ని పెంచుతుందని, ఇప్పటికే చెడిపోయిన వాతావరణం మరింత చెడిపోతుందని , అందువల్ల దాని విడుదలకు అనుమతి ఇవ్వవద్దని ముంబయి పోలీసులు ప్రభుత్వానికి చెప్పారు.

ఈ వివాదాస్పద సినిమాలో ముంబయిలో ఉత్తరాదివారికి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసే పాత్ర కమాల్ ఖాన్ పోషించారు. ఉత్తరాదివారికి వ్యతిరేకంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే ఉద్యమం చేపట్టిన నేపథ్యంలో అదే ఇతివృత్తంగా ఈ సినిమా నిర్మితమైంది. కమాల్ ఖానే ఈ సినిమాకు నిర్మాత. పోలీసు అధికారులు ఈ నెల 8వ తేదీన దోశద్రోహి సినిమాను చూశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+