వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గిరిజనులను చంపిన నక్సల్స్
ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్ల మండలం తిప్పాపురం అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఇద్దరు గిరిజనులను కాల్చి చంపారు. పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ నక్సలైట్లు వారిని చంపినట్లు సమాచారం. గతంలో ఆ గ్రామ సర్పంచ్ నర్సయ్యను నక్సల్స్ రెండు రోజుల పాటు బంధించి, హెచ్చరించి వదిలేశారు. ఆ తర్వాత కూడా గిరిజనులకు కొంత మందికి నక్సల్స్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇన్ ఫార్మర్ల పేరుతో గిరిజనులను నక్సలైట్లు కాల్చి చంపడం దారుణమని పోలీసులు అంటున్నారు. గిరిజనులు తమకు సమాచారం ఇస్తున్నారనే నక్సల్స్ ఆరోపణలను వారు ఖండించారు.
Story first published: Monday, November 24, 2008, 9:55 [IST]